Sunday, November 16, 2014

37 -- పద్యరచన - 737 (అవ్వ)



కవిమిత్రులారా, పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 11/16/2014 12:05:00 AM
కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు :

అవ్వా ప్రపంచములో నిన్ను చూసే వాళ్ళు ఎవ్వరూ లేరా! ఎందుకు ఈ వయసులో ఈపని చేస్తున్నావు?  అన్నారు గోలి హనుమచ్ఛాస్త్రి గారు, Chandramouli Suryanarayana గారు.
ఏం నాలుగు మెతుకులు పెట్టే పిల్లలు లేరా! అని Laxminarayan Ganduri  గారు వాపోయారు.
Shankaraiah Boddu గారు ఏమయితే ఏమి తన కాళ్ళ మీద తను నిలబడాలని ప్రయత్నిస్తోంది అన్నారు. దానికి sailaja గారు సమర్ధిస్తూ "పస్తుల నుండక బ్రతికెడు బామ్మకు"  జేజే!!! చెప్పారు.

గోలి హనుమచ్ఛాస్త్రి చెప్పారు...
అమ్మగ మెలిగిననీవే
అమ్మగ నీ పొత్తములనె యరుదెంచితివా !
ఇమ్ముగ నినుజూచుటకై
ఇమ్మహిలో నెవరులేర యిది దారుణమే !

Chandramouli Suryanarayana చెప్పారు...
అవ్వా నీవీ వయసున
నెవ్వరి యాశ్రయములేక నేకాకివిగా 
నివ్వీధిలోననమ్ముట
యివ్విధముగ పత్రికలను నివ్వెరపరచున్
నవంబర్ 16, 2014 12:59 AM 

Laxminarayan Ganduri చెప్పారు...
ఎనుబది యేండ్లు నిండినవి యెందుకు కష్టము ఫూటుపాతుపై
ననుదిన మిట్టులన్ జనుల కమ్ముచు నుంటివి వార్త పత్రికల్
తనయులు బుక్కెడన్నమును తల్లికి బెట్టని వారలుందురే !
జననము నిచ్చి రాగమున సాకిన త్యాగికి వృద్ద మాతకున్.
నవంబర్ 16, 2014 4:51 PM

Shankaraiah Boddu చెప్పారు...
పుత్రులు లేకనో మరియు పుత్రిక లెవ్వరు చెంతలేకనో
సత్రమునందుభుక్తికయి సాయము గోరక కష్టమొందుచున్
చిత్రముగా ప్రయత్నమును జేయుచు నున్నది కాలిబాటపై
పత్రిక లమ్ముచున్ ముసలి బామ్మ శ్రమించుచు పొట్టకూటికై
నవంబర్ 16, 2014 5:53 PM

sailaja చెప్పారు...
హస్తములు వణుకు వయసున
పుస్తకముల నమ్ముచున్న ముదుసలి గనరే!
మస్తకమున తెలివి గలిగి
పస్తుల నుండక బ్రతికెడు బామ్మకు జేజే!!!

No comments:

Post a Comment