Tuesday, November 28, 2017

80 - వీణా బంధ ఉత్పలమాల (శివస్తుతి)

రచయిత :
పూసపాటి కృష్ణ సూర్య కుమార్

కారుణమూర్తి,  కోకనద,   ల్మషకంఠ,     కపాలధారి, కే
దార,యగస్త్య, ధూర్జటి, సదాశివ,యీశ్వర,  లోకపాలకా,
కారణ కారణమ్ము,శివ, గంగపతీ,భవ,  చంద్ర శేఖరా,  
మారిపతీ, యనారతము మమ్ముల గాచుము  లోకరక్షకా. 

  

3 వ్యాఖ్యలు:

  1. కొన్ని లక్షణాలను గమనించాను గానీ వీణాబంధ లక్షణాలను గురించి కొంచెం పూర్తిగా విశదీకరిస్తే మాలాంటి వాళ్ళకి కొంచెం తృప్తిగా ఉంటుంది.
    ప్రత్యుత్తరంతొలగించు

  2. వీణలో 24 పలకులుంటాయి అందువల్ల 24 అక్షరములు గల పద్యమును ఎంచుకోవాలి అవి సరసిజ,క్రౌoచ పద,అష్టముర్తి మరియు తన్వి అయితే బాగుంటాయి. వీణలో మూడు తీగలు ముఖ్యమట అందువల్ల పద్యము మూడు పాదములలో వ్రాసి చిత్ర మాలికలో వుంచి నాల్గవ పాదము మూడు పాదములలో దాగి వుండాలి . కానీ నేను శ్రీ వల్లభ వఝుల వారు వ్రాసిన ఉత్పల మాల వృత్తపు స్పూర్తి తో వ్రాశాను. తదుపరి ప్రయత్నములో పూర్తీ నియమ నిబంధనలు పాటించుతాను .

    ప్రత్యుత్తరం
  3. పూసపాటి గారూ మీ ఈ ప్రయత్నం ఎంతో మెచ్చుఁకో దగినది.

Monday, November 13, 2017

79 - సమస్య - 2519 (పొడి యొనర్చువాని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పొడి యొనర్చువానిఁ బొగడ వశమె"
ఈ సమస్య సూచించిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు :

    1. ఘుమఘుమల పొగాకు గుంటూరులోఁబట్టి
      పిడుగురాళ్ల సుధను ప్రేమఁ జేర్చి
      ఘాటు నాటుకొనగ ఘనముగ నస్యపు
      పొడి యొనర్చువానిఁ బొగడ వశమె||
      ప్రత్యుత్తరం
    2. ఎరుపు రంగు వచ్చి యెఱ్ఱగా వేగిన
      మంచి కంది పప్పు కొంచ మైన
      యెండు మిర్చి యుప్పు దండిగా జతజేసి
      పొడి యొనర్చు వానిఁ బొగడ వశమె
      ప్రత్యుత్తరం

      ప్రత్యుత్తరాలు

      1. భళా! వారి అక్కయ్యగారు కందివారి కొసగు కందిపొడి ఉపహారం!

        నమో నమః !