హరహర శంకరా యనుచు నార్తిని వేడిన సర్వ సంపదల్
వరముగ నిత్తువంచు విని పర్వదినమ్ముల నీదు పూజలన్
కరమొనరించు భక్తులకు కన్నులపండువు నీ విభూతులౌ
మరియొక జన్మ లేదుగద మాలిమి నీవు బిరాన నేలుటన్.
లింగము చెంత జేరి గన లేదిక పాపము దాని భక్తితో
గంగను జేయ షేచనము కానిది జన్మ మరొక్క మారు నా
బెంగ యిదే కదా భవపు భీతిని బాపెడు దేవ కాశి మా
ముంగిట నున్న గాని నిను మోదముతో దరిశింప నైతినే.
గుడిసెలలో వసించుచును కూటికి లేక నుపాధి లేక య
ట్టడుగున చాల పేదరిక మందున మ్రగ్గచు బాధ లొందుచున్
బడలిక లేక జీవితము బండిని లాగుచు వెళ్ళ బుత్తు రా
బడుగుల బాగుజేయ గల బాధ్యత నెవ్వరు తీసుకుందురో!
భారత నారి యాదిగురువై జగమెల్లను మార్చి దివ్య సం స్కారము చారు శీల గుణ సంపద లిచ్చెను నాడు! నేడు చి న్నారికి, నారికే యిట మనన్ భయమౌ ప్రియ దైవమా! నమ స్కారమటంచు నిల్చెనొక చక్కని బాలిక చీరకట్టుతోన్
కవిమిత్రులారా, ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... తారలు మధ్యాహ్నవేళ తళుకున మెరసెన్.
ఈ సమస్యను పంపిన అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు.
అవధానంలో గరికిపాటి వారికి ఇచ్చిన సమస్య ఇది... తారల కాంతిచే పగలు తళ్కులు చిందియు తెల్లబోయెగా!
కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యం నాగరాజు రవీందర్చెప్పారు... చీరల కొరకై యొక సతి పోరుచు తన మగని తోడ మోదగ తలపై ధారుణిపై బడిన పతికి తారలు మధ్యాహ్నవేళ తళుకున మెరసెన్.
Pandita Nemani చెప్పారు...