Showing posts with label శంకరాభరణం పద్యం రాజేశ్వరి నేదునూరి జిగురు సత్యనారాయణ. Show all posts
Showing posts with label శంకరాభరణం పద్యం రాజేశ్వరి నేదునూరి జిగురు సత్యనారాయణ. Show all posts

Monday, November 13, 2017

79 - సమస్య - 2519 (పొడి యొనర్చువాని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పొడి యొనర్చువానిఁ బొగడ వశమె"
ఈ సమస్య సూచించిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు :

    1. ఘుమఘుమల పొగాకు గుంటూరులోఁబట్టి
      పిడుగురాళ్ల సుధను ప్రేమఁ జేర్చి
      ఘాటు నాటుకొనగ ఘనముగ నస్యపు
      పొడి యొనర్చువానిఁ బొగడ వశమె||
      ప్రత్యుత్తరం
    2. ఎరుపు రంగు వచ్చి యెఱ్ఱగా వేగిన
      మంచి కంది పప్పు కొంచ మైన
      యెండు మిర్చి యుప్పు దండిగా జతజేసి
      పొడి యొనర్చు వానిఁ బొగడ వశమె
      ప్రత్యుత్తరం

      ప్రత్యుత్తరాలు

      1. భళా! వారి అక్కయ్యగారు కందివారి కొసగు కందిపొడి ఉపహారం!

        నమో నమః !