Showing posts with label రాంభట్ల పార్వతీశ్వర శర్మ. Show all posts
Showing posts with label రాంభట్ల పార్వతీశ్వర శర్మ. Show all posts

Monday, June 16, 2014

013 - సమస్యాపూరణం - 1338 (మల్లెతీఁగకు పూచె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
మల్లెతీఁగకు పూచె చేమంతులెన్నొ.



Pandita Nemani చెప్పారు...
అమ్మా! రాజేశ్వరి గారూ! శుభాశీస్సులు.

మా మనుమరాలు కళల పద్మజుని యాలు
సిరుల బేర్కొను నెడల శ్రీధరుని యాలు
వరలు సౌభాగ్యమెన్న శంకరుని యాలు
ముద్ద బంగార మనదగు ముద్దరాలు
మానినీమణి యలివేణి మల్లెతీగ!
కొప్పునన్ పుష్ప మాలికల్ కొల్వుతీరె
నట్టి పూబోడి మరియింత నందగింప
మల్లెతీగకు పూచె చేమంతులెన్నొ!
పండిత నేమాని వారూ,
‘మల్లెపూవువంటి మనుమరాలి ఒంటినిండ చేమంతులు...’ మనోహరమైన భావం. చక్కని పూరణ. అభినందనలు.
మనుమరాలిని ముగ్గురమ్మల బోలు పుత్తడిబొమ్మగా వర్ణించిన పద్యం చాలా బాగుంది.
*
"అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారూ,
ముగ్ధమనోహరమైన భావంతో పూరణ చెప్పి ఆనందాన్ని కలిగించారు. అభినందనలు.
*
మార్చి 01, 2014 2:13 PM