Monday, December 29, 2014

44 - న్యస్తాక్షరి-21 (బమ్మెర పోతన)

కవిమిత్రులారా, ఈనాటి పద్యరచనకు: 
అంశం- బమ్మెర పోతన.
ఛందస్సు- ఉత్పలమాల.
మొదటిపాదం మొదటి అక్షరం ‘భా’
రెండవ పాదం ఆఱవ అక్షరం ‘భా’
మూడవ పాదం పదవ అక్షరం ‘భా’
నాల్గవ పాదం పదునాఱవ అక్షరం ‘భా’
వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 12/29/2014 12:10:00 [AM]

కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు :
జిగురు సత్యనారాయణ చెప్పారు...
భాగవతమ్ము వ్రాసె కవి బమ్మెర పోతన తేనెలూరగన్
సాగెడి భక్తి భావమున చక్కని చక్కెర చిందినట్టులన్
బాగుగ నుండెనో మనది భాగ్యము పుట్టెను తెన్గు గడ్డపై
నాగలి బట్టి పద్యములు నాటెడు వాడిట భారతీ కృపన్
డిసెంబర్ 29, 2014 1:24 [AM]

గోలి హనుమచ్ఛాస్త్రి చెప్పారు...
భారము నీదటంచు తన పల్కుల మూలము నీవెయంచు తా
మీరిన భక్తి భావమున మేలుగ దల్చుచు రామచంద్రునే
పారగ పాతకమ్ము విన భాగవతమ్మును వ్రాసినాడుగా
కోరక రాజభోగములు గొప్పగ పోతన " భాగ్యవంతుడే ".
డిసెంబర్ 29, 2014 9:35 [PM]

No comments:

Post a Comment