Wednesday, November 19, 2014

38 -- పద్యరచన - 739 (జామ పండు)



కవిమిత్రులారా  పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 11/18/2014 12:05:00 AM

కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు :

వసంత కిశోర్ చెప్పారు...
ఆకు పచ్చగ నున్నచో ♦ నాపిలు వలె
పసుపు పచ్చగ నున్నచో ♦ పనస వలెను
నద్భుతంబైన రుచి గల్గు ♦ నమృత ఫలము
జనులు చవిగొని మెచ్చగా ♦ జగము నందు
చౌక ధరలోన దొరకెడు ♦ జామ పండె !
నవంబర్ 18, 2014 2:31 AM

సంపత్ కుమార్ శాస్త్రి చెప్పారు...
ఫలరాజంబని చెప్పనేర్తురుకదా వ్యాపారసంఘంబులున్
బలమున్ గూర్చునటంచుఁ బల్కిరికదా వైద్యుల్ ముదంబంది స
త్ఫలమౌ పూజలకెల్లవేళలనిరే భక్తాళి "జాంపండు" నీ
కలికాలామృతమై చెలంగెనిది సద్గ్రాహ్యంబుగానిద్ధరన్.
నవంబర్ 18, 2014 10:19 AM

No comments:

Post a Comment