Monday, May 2, 2016

70 - ఖండకావ్యము - 15 (తెలుఁగు వెలుఁగు)

కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు :

రచన : మిస్సన్న (దువ్వూరి వేంకట సరసింహ సుబ్బారావు)

పాప నవ్వువోలె పాల మీగడ వోలె
మంచి గంధ మట్లు మల్లె లట్లు
వీణ పాట రీతి విన సొంపుగా నుండు
తీయ తేనె లొలుకు తెలుఁగు పలుకు.



భోజనమ్ము నందు బొబ్బట్లు పులిహార
పనసపొట్టు కూర పచ్చిపులుసు
ఆవకాయ ఘాటు లాపైన గోంగూర
తినిన జిహ్వ లేచు తెలుఁగు రుచుల.



ఆంధ్రమందునైన అమెరికాలో నైన
వెలుఁగులీను చుండు తెలుఁగు పలుకు
మనిషి దూరమైన మమతలు మాయునా
మైత్రి మహిమ మిన్న ధాత్రి లోన.

No comments:

Post a Comment