Tuesday, December 16, 2014

42-- పద్యరచన - న్యస్తాక్షరి-19

అంశం- దాఁగుడుమూఁతలు.
ఛందస్సు- ఉత్పలమాల.
మొదటిపాదం మొదటి అక్షరం ‘బా’
రెండవపాదం ఆఱవ అక్షరం ‘వే’
మూడవపాదం పదవ అక్షరం ‘దా’
నాలుగవపాదం పదునాఱవ అక్షరం ‘సం’
వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 12/15/2014 12:10:00 [AM]

కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు :
లక్ష్మీదేవి చెప్పారు...
బాసనుఁజేసితీవనుచు భాగ్యమునాదని పొంగిపోతి, నీ
కోసమె యెల్లవేళలను కోటివరమ్ముల కోరుకొంటి, నీ
దాసిగసేవఁజేసితిని దాగుడుమూతలనాడుచుంటివే?
నాసముఖమ్ముఁజేరవొకొ, నందకుమారుడ! సందెవేళలో?
డిసెంబర్ 15, 2014 8:04 [AM]

A.Satyanarayana Reddy చెప్పారు...
బాగగు నాకు నో చెలియ! భాగిని గా నువు నాకు చిక్కినన్
రాగము పంచ వే యిటకు రమ్ముసుహాసిని మంజు భాషిణీ
దాగుడు మూతలేల సఖి! దాచకు నీ హృదిలోని కోర్కెలన్
సాగును జీవితమ్ము నువు సారధి వైనను సంతసమ్ముగన్
డిసెంబర్ 15, 2014 10:04 [PM]

No comments:

Post a Comment