కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు:
మిస్సన్న చెప్పారు...
వరముగ నిత్తువంచు విని పర్వదినమ్ముల నీదు పూజలన్
కరమొనరించు భక్తులకు కన్నులపండువు నీ విభూతులౌ
మరియొక జన్మ లేదుగద మాలిమి నీవు బిరాన నేలుటన్.
లింగము చెంత జేరి గన లేదిక పాపము దాని భక్తితో
గంగను జేయ షేచనము కానిది జన్మ మరొక్క మారు నా
బెంగ యిదే కదా భవపు భీతిని బాపెడు దేవ కాశి మా
ముంగిట నున్న గాని నిను మోదముతో దరిశింప నైతినే.
జనులనుఁ జూడగా కదలి చల్లగ వచ్చితివా జగత్ప్రభూ!
మనమున నింత కింత కృప మాపయి చూపగ లోకనాథుడా!
దినదినమిట్టి లోకమున దీనత నొందితిమయ్యదేవుడా!
కనులను విప్పి నీదరిని గైకొనవయ్య జగత్పతీ! హరీ!
No comments:
Post a Comment