కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
మల్లెతీఁగకు పూచె చేమంతులెన్నొ.
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
మల్లెతీఁగకు పూచె చేమంతులెన్నొ.
అమ్మా! రాజేశ్వరి గారూ! శుభాశీస్సులు.
మా మనుమరాలు కళల పద్మజుని యాలు
సిరుల బేర్కొను నెడల శ్రీధరుని యాలు
వరలు సౌభాగ్యమెన్న శంకరుని యాలు
ముద్ద బంగార మనదగు ముద్దరాలు
కొప్పునన్ పుష్ప మాలికల్ కొల్వుతీరె
నట్టి పూబోడి మరియింత నందగింప
మల్లెతీగకు పూచె చేమంతులెన్నొ!
‘మల్లెపూవువంటి మనుమరాలి ఒంటినిండ చేమంతులు...’ మనోహరమైన భావం. చక్కని పూరణ. అభినందనలు.
మనుమరాలిని ముగ్గురమ్మల బోలు పుత్తడిబొమ్మగా వర్ణించిన పద్యం చాలా బాగుంది.
*
"అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారూ,
ముగ్ధమనోహరమైన భావంతో పూరణ చెప్పి ఆనందాన్ని కలిగించారు. అభినందనలు.
*
No comments:
Post a Comment